రూ.450 కోట్ల స్కామ్‌లో శుబ్‌మన్ గిల్, రాహుల్ తెవాటియాతో మరో ఇద్దరు క్రికెటర్లు!

Date:

- Advertisement -


Gujarat Titans

Shubman Gill among 4 Gujarat Titans players to be summoned by CID in ₹450 crore scam: Report

టీమిండియా యంగ్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌కి ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, గుజరాత్‌లో ఓ స్కామ్‌లో ఇరుక్కున్నాడు. గుజరాత్ టైటాన్స్‌కి ఆడిన శుబ్‌మన్ గిల్‌తో పాటు రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, సాయి సుదర్శన్ కలిసి అహ్మదాబాద్‌కి చెందిన భూపేంద్రసిన్హ్ జలా అనే వ్యక్తికి చెందిన ఓ ఛిట్‌ఫండ్ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టారు. వీరికి వడ్డీతో సహా డబ్బులు చెల్లిస్తానని హామీ ఇచ్చిన భూపేంద్రసిన్హ్, ఆ డబ్బులను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాడు..

ఈ కంపెనీలో శుబ్‌మన్ గిల్ రూ.1.95 కోట్లు పెట్టుబడులు పెట్టగా మోహిత్ శర్మ, రాహుల్ తెవాటియా, సాయి సుదర్శన్ కలిసి మరో రూ.2 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ కేసుని సీఐడీ దర్యాప్తు చేస్తోంది.

‘భూపేంద్రసిన్హ్ జలాతో పాటు అతని ఛార్టెడ్ అకౌంటెంట్ రుషిక్ మిశ్రాని కూడా ఈ కేసు విషయంలో విచారణ చేస్తున్నాం. బ్యాంక్ లావాదేవీలతో పాటు జలాకి చెందిన మిగిలిన అన్ని రకాల అనధికారిక అకౌంట్ బుక్స్‌ని పరిశీలిస్తున్నాం. ఇప్పటికే అతని అకౌంట్స్ అన్నింటినీ సీజ్ చేశాం.. అతని అకౌంట్‌లో రూ.52 కోట్లు ఉన్నట్టుగా గుర్తించాం..

మొత్తంగా ఈ కేసులో రూ.450 కోట్ల స్కామ్ జరిగినట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల తర్వాత ఈ మొత్తం పెరిగే అవకాశం ఉంది..’అంటూ సీఐడీ అధికారి తెలియచేశారు.. ఈ కేసులో సంబంధం ఉన్న అందరికీ సీఐడీ ప్రశ్నించనుంది. దీంతో ఆస్ట్రేలియా టూర్ ముగిసిన తర్వాత స్వదేశానికి వచ్చి, సీఐడీ విచారణలో పాల్గొనాల్సి ఉంటుంది శుబ్‌మన్ గిల్..





Source link

- Advertisement -

Top Selling Gadgets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =

Share post:

Subscribe

Popular

More like this
Related

Top Selling Gadgets