ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండో సెమీస్లో న్యూజిలాండ్ జట్టు ఫస్టు బ్యాటింగ్కు దిగింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన.. కివీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఎలాంటి మార్పుల్లేకుండానే తుది జట్టు బరిలోకి దింపింది. అటు గత మ్యాచ్కు దూరమైన దక్షిణాఫ్రికా టెంబా బవూమా మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఇవాళ్టి మ్యాచ్లో గెలిచిన జట్టు భారత్తో ఫైనల్ ఆడనుంది.
హైలైట్:
- దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ ప్రారంభం
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
- తుది జట్టులోకి వచ్చేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బవూమా

“గత ఐసీసీ టోర్నమెంట్లలో సెమీస్, ఫైనల్స్ నుంచి పాఠాలు నేర్చుకున్నాం. కీలక సమయంలో పొరపాట్లకు తావివ్వద్దని నిశ్చయించుకున్నాం. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఇవాళ్టి పోటీని సాధారణ మ్యాచ్లాగే దీనిని చూస్తాం” అని బవూమా వ్యాఖ్యానించాడు.
ఇక ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 73 వన్డే మ్యాచులు జరిగాయి. ఇందులో దక్షిణాఫ్రికా అత్యధికంగా 42 మ్యాచ్లలో గెలవగా.. 26 మ్యాచులలో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఐదు మ్యాచులలో ఫలితం రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లూ రెండుసార్లు తలపడగా.. చెరోమారు విజయం సాధించాయి. ఇక ఈ టోర్నీలో ఇప్పటికే భారత్ ఫైనల్ చేరింది. ఇవాళ్టి మ్యాచులో గెలిచిన జట్టు మార్చి 9న జరిగే ఫైనల్లో భారత్తో తలపడనుంది.
తుది జట్లు..
దక్షిణాఫ్రికా:
ర్యాన్ రికెల్టన్, టెంబా బావుమా (కెప్టెన్), రసీ వాన్ డెర్ డసెన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్క్రమ్ వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి
న్యూజిలాండ్:
విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, కైల్ జెమీసన్, విలియం ఓరూర్కీ




